నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు. ఇందులో విజయ్ రూపానీ ఉన్నారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు.
ఇక సోమవారం అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్కోట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇక విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో విజయ్ రూపానీ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు చిత్రీకరించిన వీడియోలో దృశ్యాలు కనిపించాయి.