నవతెలంగాణ-ధర్మసాగర్
గ్రామస్తులందరూ కలిసి వస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఉనికి చర్ల విలీన గ్రామం గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధిలోని 1కోటి 05లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, వరద కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మామాట్లాడుతూ అతి త్వరలోనే ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు రేఖలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ పనులను జులై 15లోగ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే ఉనికిచర్ల నుండి రాపాకపల్లి రోడ్డుకు 41లక్షలు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని తెలిపారు. గ్రామంలో స్మశాన వాటికకు ప్రహరీ గోడ, వ్యవసాయ భూములకు రోడ్డు ఏర్పాటు, కమ్యూనిటీ హల్ నిర్మాణానికి అతి త్వరలో మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మహిళా కమ్యూనిటీ భవనం గ్రామస్తుల అభ్యర్థుల మేరకు నిర్మిస్తానని వెల్లడించారు. ఉనికిచర్ల గ్రామానికి 24ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, అతి త్వరలో మరో 24ఇల్లు మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం ముందుకు రావాలని, గ్రామస్తులందరూ కలిసి వస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, గ్రేటర్ వరంగల్ డిప్యుటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంతోష్, స్థానిక నాయకులు, బల్దియా అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులందరూ కలిసి వస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యం: కడియం శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES