- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల పాటు భారత్ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. 2011లో వెస్టిండీస్పై టెస్టుల్లో ఆయన అరంగేట్రం చేశారు. కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 46.85 బ్యాటింగ్ సగటు ఉంది. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు.
- Advertisement -