‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా అలరించనుంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ ఈనెల 27న జీ5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. 1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసు కోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠ భరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది. జీ5 తెలుగు బిజినెస్ హెడ్ – అనురాధ గూడూర్ మాట్లాడుతూ, ‘జీ5లో సాధారణ ప్రజలను ప్రతిబింబించే, వారికి కనెక్ట్ అయ్యే కథల్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సిరీస్ కూడా ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చూపిస్తుంది’ అని అన్నారు.
”రెక్కీ’ తర్వాత, మరోసారి జీ5తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపి వేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ’ అని దర్శకుడు కష్ణ పోలూరు అన్నారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ, ”రెక్కీ’ విజయం తర్వాత, ఈ సిరీస్ కోసం మరోసారి జీ5తో చేతులు కలపడం చాలా బాగుంది. ఈ కథ విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రేక్షకులు మేం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా ఆనందంగా, సంతప్తికరంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాను’ అని అభిజ్ఞ వూతలూరు చెప్పారు.
నవ వధువులు చనిపోయే ‘విరాటపాలెం’
- Advertisement -
- Advertisement -