”కన్నప్ప’లో ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి, ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి.
ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశ చెందరు. ఇప్పటి వరకు మూవీని చూసిన వాళ్ళందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు’ అని దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ అన్నారు. విష్ణు మంచు నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈనెల 27న రిలీజ్ కానుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమా రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ‘మహాభారతం’ సీరియల్ ద్వారా నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అక్షయ్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం.. ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. కన్నప్ప మీద ఇంత వరకు అన్ని భాషల్లో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది. కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. వారు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు (నవ్వుతూ). కన్నప్ప అనేది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర. దీన్ని ఈ తరం ప్రేక్షకులకు మరింత అర్థవంతంగా చెప్పేందుకు ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం.
‘కన్నప్ప’గా విష్ణు 100% న్యాయం చేశారు
- Advertisement -
- Advertisement -