- Advertisement -
నవతెలంగాణ – గంభీరావుపేట: గంబీరావుపేట మండల పరిధిలోని గంభీరావుపేట, సముద్రా లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం – 2025 మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్చత పై పని తీరుపై సర్వే చేపట్టారు. ఆనంతరం పరిశుభ్రతను మెరుగుపరచి, నిరంతర అభివృద్ధిని ప్రోత్సహించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనుముల రాజేందర్,ఎంపిఓ సుధాకర్, ఎస్బిఎం జిల్లా కోఆర్డినేటర్ సురేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -