No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్పోటనం

ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్పోటనం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో పలు విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. బాలికి వెళ్లే పలు విమానాలు వెనక్కిమళ్లాయి. ఎయిరిండియా విమానం ఏఐ 2145 కూడా మధ్యలో నుంచే తిరుగుపయనమై ఢిల్లీకి వచ్చింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిరిండియా ప్రకటించింది. దక్షిణ మధ్య ఇండోనేషియాలోని మౌంట్‌ లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మంగళవారం బద్దలై, వేడి బూడిదను గాలిలోకి ఎగరేసింది. బిలం నుండి 8 కిలోమీటర్ల (సుమారు 5 మైళ్ళు) వరకు లావా విస్తరించింది. ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం అగ్నిపర్వతం 10 వేల మీటర్లు (సుమారు 32,800 అడుగులు) మందపాటి బూడిద మేఘాలను విడుదల చేసినట్లు నమోదయిందని తెలిపింది. ఆ బూడిద పుట్టగొడుగు ఆకారంలో ఉన్న బూడిద మేఘంగా ఆవరించింది. పర్వతం నుండి 90 కిలోమీటర్లు (సుమారు 56 మైళ్ళు) నుండి 150 కిలోమీటర్లు (దాదాపు 93 మైళ్ళు) దూరంలో ఉన్న నగరాల వరకు ఈ దట్టమైన బూడిద కమ్ముకుంది. అయితే ఈ విస్ఫోటనంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నివేదించింది. భారీ వర్షపాతం కారణంగా అగ్నిపర్వతం నుండి ఉద్భవించే లావా నదులలో ప్రవహించే అవకాశం ఉండటంతో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad