- Advertisement -
నవతెలంగాణ-కామారెడ్డి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజంపేట మండల కేంద్రంలో గ్రామస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 10 టీములు పాల్గొని పరస్పరం తలపడ్డాయి. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో హిందూదాల్, ఆజాద్ హింద్ జట్లు పోటీపడగా హిందూదాల్ టీం విజయం సాధించింది.విజేతలకు గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్, ఉపసర్పంచ్ ఇమ్రాన్ అలీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు అభినందించి, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
- Advertisement -



