Thursday, June 5, 2025
E-PAPER
Homeజాతీయంఎప్పటికప్పుడే ఓటింగ్‌ శాతం వెల్లడి

ఎప్పటికప్పుడే ఓటింగ్‌ శాతం వెల్లడి

- Advertisement -

– ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
– సరికొత్త సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం మొదటిసారిగా బీహార్‌ ఎన్నికల్లో ప్రయోగం
న్యూఢిల్లీ:
ఓటర్ల ఓటింగ్‌ శాతం విషయంలో ప్రతిపక్షాల నుంచి నిరంతరం ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్‌, కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సకాలంలో ఓటింగ్‌ డేటాను అందించడానికి సాంకేతికత ఆధారిత వ్యవస్థను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల వేళ సకాలంలో ఓటింగ్‌ శాతం డేటాను అందించేందుకు ఒక సరికొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అది ఒక క్రమబద్దీకరించిన, సాంకేతికతో నడిచే వ్యవస్థ అని స్పష్టం చేసింది. దీని వల్ల మాన్యువల్‌ రిపోర్టింగ్‌ పద్ధతిలో జరిగే ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంది.
‘ఈ కొత్త వ్యవస్థ ద్వారా, పోలింగ్‌ జరిగే రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్‌ అధికారులు (పీఆర్‌ఓ) కొత్త ఈసీఐఎన్‌ఈటీ అప్లికేషన్‌లో ఓటర్ల ఓటింగ్‌ను నేరుగా నమోదు చేయగలుగుతారు. దీని వల్ల పోలింగ్‌ ట్రెండ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది’ అని ఈసీ తెలిపింది.
‘ఓటింగ్‌ డేటాను ఇప్పుడు పీఆర్‌ఓలు పోల్‌ ముగిసిన వెంటనే ఈసీఐఎన్‌ఈటీ లో నమోదు చేస్తారు. వారు పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే ముందే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు. కనుక గతంలోలాగా ఆలస్యం జరిగే అవకాశం గణనీ యంగా తగ్గుతుంది. నియోజక వర్గాల వారీగా నవీ కరించిన ఓటింగ్‌ శాతం ఇప్పుడు యాప్‌లోనే అందు బాటులో ఉంటుంది. అయితే నెట్‌వర్క్‌ కనెక్టివిటీకి లోబడి ఇది ఉంటుంది’ అని ఈసీ స్పష్టం చేసింది.
మొదటిసారిగా బీహార్‌ ఎన్నికల్లో ప్రయోగం
ఈసీఐఎన్‌ఈటీ సాంకేతిక వ్యవస్థను తొలిసారిగా బీహార్‌ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఉపయోగించనుంది. ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈక్రమంలో ఈ ఎన్నికల్లో కొత్త యాప్‌ సేలవను ఎన్నికల సంఘం ఉపయోగిచే అవకాశం ఉంది. గతంలో ఓటింగ్‌ డేటాను మాన్యువల్‌గా సేకరించి, ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ లేదా మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు పంపేవారు. దీని వల్ల ఓటింగ్‌ శాతం చాలా ఆలస్యమయ్యేది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -