Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంఅహ్మదాబాద్ మృతుల‌కు బృందా కారత్ సంతాపం

అహ్మదాబాద్ మృతుల‌కు బృందా కారత్ సంతాపం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చ‌నిపోయిన‌ మృతులకు CPI(M) నాయ‌కురాలు బృందా కారత్ సంతాపం తెలియ‌జేశారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె కోరుకున్నారు. ప్ర‌మాద విష‌యం తెలిసి తాను షాక్ గురైయ్యాను, ఇంత‌మంది ఈ దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోవ‌డం తీవ్ర బాధాక‌రమైన విష‌యం, ప్ర‌మాద‌తీవ్ర‌త‌పై, కార‌ణాల‌పై విమానయాన మంత్రిత్వ శాఖ నిపుణులతో కలిసి దర్యాప్తు చేస్తుంది. ఈ త‌రహా సంఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్‌లో జ‌ర‌గ‌కుండా నిపుణులు కీల‌క సూచ‌న‌లు చేయాల‌ని మీడియా స‌మావేశంలో ఆమె కోరారు.

గురువారం జ‌రిగిన‌ విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయారు. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే 11ఏ సీటు పొందిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. విమానం బీజై మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో లంచ్ చేస్తున్న విద్యార్థులు 20 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, మిగతా వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఘటన స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతదేహాల కోసం శిథిలాల కింద జాగిలాలతో గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -