Thursday, June 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధ నష్టాలు, ఎదురుదెబ్బలు సైన్యంపై ప్రభావం చూపవు

యుద్ధ నష్టాలు, ఎదురుదెబ్బలు సైన్యంపై ప్రభావం చూపవు

- Advertisement -

– సిడిఎస్‌ అనిల్‌ చౌహన్‌
పుణే:
యుద్ధ నష్టాలు, ఎదురుదెబ్బలు సైన్యంపై ప్రభావం చూపవని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మంగళవారం పేర్కొన్నారు. పాకిస్తాన్‌ భారత్‌ను రక్తసిక్తం చేసే విధా నాన్ని అనుసరిస్తోందని, అయితే భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్‌లైన్‌ గీసిం దని తెలిపారు. సావిత్రిబాయి పులే విశ్వ విద్యాలయంలో ఒక కార్య క్రమంలో సిడిఎస్‌ ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభ దశలో భారత్‌ యుద్ధవిమానాలను కోల్పోయిందని గతంలో తాను చెప్పిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. ‘మన వైపు జరిగిన నష్టాల గురించి మాత్రమే చెప్పానని’ తెలిపారు. నష్టాలు ముఖ్యమైనవి కావని, ఫలితాలు మాత్రమే ముఖ్యమైనవి అన్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ఆపాలి, భారత్‌ను ఉగ్రవాదానికి బందీగా ఉంచకూడదనేదే ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక ఉన్న ఆలోచనని చెప్పారు. కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూ.. 48 గంటల పాటు ఎదురుకాల్పులు చేయాలని పాకిస్తాన్‌ ప్రణాళిక వేసిందని, కానీ అది ఎనిమిది గంటల్లోనే ఆగిపోయిందని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని గ్రహించే చర్చలకు పాక్‌ దిగి వచ్చిందని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించాలని పాకిస్తాన్‌ నుంచి వచ్చిన అభ్యర్థనను భారత్‌ అంగీకరించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -