ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు దీకొండ భరత్
నవతెలంగాణ- గోవిందరావుపేట
విధులకు సక్రమంగా హాజరు కాని వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ధీకొండ భరత్ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు హాస్టల్ లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ మండల కేంద్రంలోన ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ రెగ్యులర్గా రాక విద్యార్థులకు వార్డెన్ పేరు తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు.
ఎస్పీ బాయ్స్ హాస్టల్ లోనే విద్యార్థులను పట్టించుకోవడంలేదన్నారు. అదేవిధంగా విద్యార్థులకు బాత్రూములు ఒక్కటి కూడా పూర్తిగా పనిచేయడం లేదని వారన్నారు, అదేవిధంగా వంట ఉండడానికి ఒక్కరూ కూడా లేక వంటలు వర్షానికి నానుడు ఎండకు ఎండుడు, కనీసం వాటర్ ట్యాబ్లు కూడా స్నానాలు చేసే దగ్గర పాకురు, పాకు రు ఉండడం వలన గతంలో పలుమార్లు వార్డెన్ కి చెప్పిన కానీ విద్యార్థుల సమస్య పట్టించు కోవటం లేదని వారు అన్నారు ఇప్పటికైనా అధికారుల స్పందించి ఆ యొక్క హాస్టల్ వార్డెన్ నీ విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని వారు అన్నారు లేని పక్షం లో హాస్టల్ లో వున్నా విద్యార్థుల ను సమీకరణ చేసి భవిష్యత్తు లో పోరాటాలు చేస్తమాను హేచ్చరించారు.



