నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సెట్లో బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ సినిమా కోసం శంషా బాద్ సమీపంలో వేసిన సెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్లోకి నీళ్ళు ముంచెత్తాయి. దీంతో పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
‘ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు కొన్నిసార్లు రిస్క్లు తప్పవు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా మేం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ, ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు’ అని నిఖిల్ తెలిపారు.
రామ్చరణ్ సమర్పణలో ఈ సినిమా రానుంది. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి.మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ కథానాయిక. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
మేమంతా క్షేమం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES