- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్ మంతర్ వేదికగా జరుగుతోన్న బీసీ ధర్నా దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకొని రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లను బిల్లుగా మార్చి కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ఇది కాంగ్రెస్పార్టీ అంశం కాదని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య అంశమని అన్నారు. ఈ బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. మా పని పూర్తి చేశామని, ఇక కేంద్రమే బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.
- Advertisement -