Friday, June 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ స‌త్తా మాకు ఉంది..ట్రంప్ ప‌ర్మిష‌న్ అవ‌స‌రంలేదు: నెతన్యాహు

ఆ స‌త్తా మాకు ఉంది..ట్రంప్ ప‌ర్మిష‌న్ అవ‌స‌రంలేదు: నెతన్యాహు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు దీమా వ్య‌క్తం చేశారు. ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్‌ న్యూక్లియర్‌ స్థావరాలపై దాడి చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చేవరకు వేచి చూడబోమని స్పష్టంచేశారు. ఇప్పటివరకు జరిపిన దాడులు కూడా అమెరికా ఆదేశాలతో చేయలేదని పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ కారణంగా 3,500 సంవత్సరాల యూదు చరిత్ర అంతం కావడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇరాన్‌ను ఢీకొట్టే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉందని పేర్కొన్నారు. కీలకమైన లక్ష్యాలను ఛేదించగల సత్తా ఐడీఎఫ్‌కు ఉందని నెతన్యాహు స్పష్టం చేశారు.

అయితే ఆప‌రేష‌న్ రైజింగ్ పేరుతో ఇరాన్ అణు స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇజ్రాయిల్ దాడుల‌కు తెగ‌బ‌డింది. తొలి రోజే అణు వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన కీల‌క శాస్త్ర‌వేత్త‌ను ఐడీఎఫ్ హ‌తం చేసింది. అంతేకాకుండా ఆదేశాన‌కి చెందిన కీల‌క నేత‌ల‌ను కూడా మ‌ట్టుబెట్టింది. ఈ దాడుల‌తో ఇరాన్ కూడా ప్ర‌తీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ డ్రొమ్ ను చేధించుకొని ప‌లు ప్రాంతాల‌పై ఇరాన్ క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. వారంరోజుల‌పాటు ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ఇరుదేశాల‌కు ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -