దాడులతో వాళ్లు సాధించిందేం లేదు
వారి స్థావరాలను పసిగట్టాం అవసరమైనప్పుడు దాడి చేస్తాం
దూకుడుగా వ్యవహరిస్తే భారీ మూల్యం తప్పదు : ఖమేనీ హెచ్చరిక
టెల్ అవీవ్ : కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ గురువారం తొలిసారిగా బహిరంగ ప్రకటన చేశారు. అమెరికాను గట్టి దెబ్బ కొట్టామని చెప్పారు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన ప్రధాన అల్-ఉదైద్ వైమానిక స్థావరంపై తాము జరిపిన దాడిని ప్రస్తావించారు. ఈ దాడిని అమెరికాకు చెంపపెట్టుగా ఖమేనీ అభివర్ణించారు. ఖమేనీ ప్రకటనను, ఆయన ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ‘అమెరికాను గట్టి దెబ్బ కొట్టాం. ఈ ప్రాంతంలోని కీలక అమెరికా స్థావ రాల్లో ఒకటైన ప్రధాన అల్-ఉదైద్ వైమానిక స్థావ రంపై దాడి చేశాం. దానిని భారీగా నష్టపరిచాం’ అని ఖమేనీ తెలియజేశారు. అమెరికా కీలక కేంద్రాల జాడను పసిగట్టామని, అవసరమనుకున్నప్పుడు వాటిపై దాడి చేసే సామర్ధ్యం తమకు ఉన్నదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కావచ్చునని స్పష్టం చేశారు. శత్రువు దూకుడుగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అమెరికాకు ఎన్నటికీ లొంగబోమని ఖమేనీ తన ప్రకటన, ప్రసంగంలో తేల్చి చెప్పారు. తమతో సాగించిన యుద్ధం నుంచి అమెరికా పొందింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ అణు కేంద్రాలకు పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు. వివాదంలో వాషింగ్టన్ జోక్యం సమర్ధవంతంగా లేదంటూ అమెరికాపై యుద్ధంలో విజయం సాధించినందుకు ఇరాన్ను అభి నందించారు. ‘అమెరికాపై విజయం సాధిం చినందుకు ప్రియతమ ఇరాన్కు అభినందనలు. తాను జోక్యం చేసుకోకపోతే యూదుల పాలన పూర్తిగా ధ్వంసమవుతుందని భావించినందునే అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగింది. యూదు ప్రభుత్వాన్ని కాపాడే ఉద్దేశంతో యుద్ధంలో ప్రవేశించినప్పటికీ అమెరికా సాధించిందేమీ లేదు’ అని తెలిపారు. కలకలం, వాదనలతో యుదుల పాలన ఇరాన్ పాదాల కింద పడి నలిగిపోయిందని ఖమేనీ చెప్పార.
అమెరికాను గట్టి దెబ్బకొట్టాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES