- Advertisement -
– సీపీఐ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజా సమస్యలను ఈ సందర్భంగా నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -