- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘2 అలైన్మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈనెల 22 నాటికి ఒక దానిని ఖరారు చేస్తాం. మొదటి అలైన్మెంట్లో తుమ్మిడిహెట్టి-మైలారం 71.5kms గ్రావిటీ కెనాల్, 14kms టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు, రెండో దానిలో పంపింగ్ స్టేషన్తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉంది’ అని తెలిపారు.
- Advertisement -