నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రభుత్వ లక్ష్యానికి మించి తాడిచెర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ రబీ సీజన్లో వందశాతం వరిదాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరిగిందని తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13 వరిదాన్యం కొనుగోలు కేంద్రాల్లో వందశాతం ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. 90 వేల క్వింటాళ్ళు ధాన్యం సేకరించాలనే లక్ష్యం పెట్టుకొని మండలంలో మోట్ 1,426 మంది రైతుల నుంచి 96,240 క్వింటాళ్ల ధాన్యం సేకరించడం జరిగిందని తెలిపారు. సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5.29.92,00 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.3,17,95,200 కోట్లు చెల్లించారని, మిగతా రూ.2,11,96,800 చెల్లించాల్సి ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ మొత్తం రూ.14,25,000 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.6,10,000 చెల్లించారని, ఇంకా రూ.8,25,000 చెల్లించాల్సి ఉందన్నారు. త్వరలోనే రైతుల ధాన్యం డబ్బులు, బోనస్ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా అడగగానే రైస్ మిల్లులు ఆలాట్ చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ధాన్యం సేకరణలో ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ చేస్తూ కొనుగోళ్లు వేగంగా సేకరించాని ఆదేశాలు జారీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్, డీసీఓలకు, ధాన్యం సేకరణ కోసం లారీలు, గన్ని సంచుల కొరత లేకుండా చూసిన సింగిల్ విండో వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు, సిఈఓలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు పాల్గొన్నారు.
వందశాతం ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం: పీఏసీఎస్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES