– తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి
నవతెలంగాణ -తాడ్వాయి: 2025 తునికాకు కోసిన కూలీలకు మొత్తం డబ్బులు, పెండింగ్ లో ఉన్న 2016 నుండి 24 వరకు తునికాకు కూలీలకు వచ్చే బోనస్ కూడా మొత్తం అకౌంట్లోకి పడితేనే తునికాకు బస్తాలు (డాగులు) పంపిస్తామని శనివారం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూపతిపురంలో తునికాకు కూలీలతో కలిసి మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న తునికాకు కల్లాలని పరిశీలించి అక్కడి తునికాకు సేకరణదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 2000 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు విడుదల చేయించామని అన్నారు. ఆ డబ్బులు ఇప్పటివరకు తునికాకు సేకరణదారులకు అందలేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా తునికాకు డబ్బులు అకౌంట్ లో వేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారని అన్నారు. చాలామందికి గతంలో కోసిన డబ్బులు పడలేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ సంవత్సరం కొన్ని గ్రామాలలో గత సంవత్సరం డబ్బులు ఇయ్యలేదని తునికాకు కోయడం కూడా బంద్ పెట్టారని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం కోసిన ఆకుల డబ్బులు పడ్డ తరువాతే అదేవిధంగా 2016 నుంచి 2024 వరకు రావలసిన తునికాకు బోనస్ డబ్బులు అకౌంట్లో పడ్డాకనే తునికాకు డాగులు ఆ గ్రామవాసులు పంపించాలని నిర్ణయం తీసుకున్నార అని అన్నారు. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం యాబై ఆకుల కట్టకు బోనస్ ఎంత ఇస్తున్నారు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా తునికాకు కోయడం వల్ల అటు ప్రభుత్వాలు ఇటు టెండర్లు పట్టిన సెట్లు లాభాలు పొందుతున్నారు గాని, తునికాకు సేకరణదారులకు మాత్రం బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి సంబంధిత కల్లెదారులు ప్రతి ఒక్కరు దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి డబ్బులు అదే విధంగా బోనస్ డబ్బులు పడేంతవరకు తునికాకు డాగులు పంపించకూడదని, ఒకవేళ పంపిస్తే ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత కళ్ళేదారులదే అన్నారు. అదేవిధంగా డబ్బులు వచ్చేటట్టు చేసే బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఒక కళ్లదారి తునికాకు సేకరణదారులకు న్యాయం జరిగేంత వరకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూనారపు సంతోష్, తాటి వినయ్అలెం సతీష్, కుర్సం లక్ష్మణ్, తరినే నారాయణ, దాట్ల సారయ్య ఎట్టి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
బోనస్ డబ్బులు అకౌంట్లో పడ్డాకనే తునికాకు బస్తాలు పంపిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES