నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. కీవ్తో యుద్ధానికి రష్యా కు తాము భేషరతుగా మద్దతిస్తున్నట్లు కిమ్ వ్యాఖ్యానించారు. బుధవారం పాంగ్యాంగ్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఈమేరకు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ సమస్యలలో రష్యా వైఖరినీ, ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉ.కొరియా బేషరతుగా మద్దతిస్తోందని కిమ్ పేర్కొన్నారు.రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తోన్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టంచేశారు.
కాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏళ్లతరబడి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రెండు దేశాలు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. యూరప్ దేశామైన బ్రిటన్ ఉక్రెయిన్కు మద్దతగా నిలిసింది. లక్ష డ్రోన్లను ఆ దేశానికి సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీనికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరగుతాయని అన్ని దేశాలు భావించగా..ఈక్రమంలో రెండు దేశాలు బాంబుల వర్షం కురిపించుకున్నాయి.