- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బన్స్వారాలో పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



