- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల పెండ్లి పీటలెక్కబోతున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించి తొలి అడుగుగా ఇంట్లో ‘పసుపు కుంకుమ’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. “శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి ‘సూర్యతేజ చిలుకూరి’ మరియు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ‘జనని బండ్ల’ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం” అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
- Advertisement -



