- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో.. ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. భారత్కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్యాంప్ బెల్ 115, షై హోప్ 103, రోస్టన్ చేజ్ 40 రన్స్ చేశారు. జస్టిన్ (50*) నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 2, జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 518/5 పరుగులకు డిక్లేర్డ్ చేయగా.. వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌటైంది.
- Advertisement -