నవతెలంగాణ – హైదరాబాద్
భారత్, వెస్టిండీస్ జట్లు కీలకమైన మూడో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రొవమన్ పావెల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్ ప్లేస్లో యశస్వీ జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్తో అతను టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు. విండీస్ జట్టు హోల్డర్ బదులు రోస్టన్ ఛేజ్ను ఆడిస్తోంది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది.