Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ..

ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ..

- Advertisement -

– సిపిఐ(ఎం) మునుగోడు మండల కార్యదర్శి  సాగర్ల మల్లేష్..
నవతెలంగాణ మునుగోడు:  తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటివరకు5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇచ్చిందని దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ ఆవేదన వ్యక్తం  చేశారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారి పద్మజ కి సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడ యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా పై పోరాడకుండా కల్లప్పగించి చూస్తూ, రైతులను ఇబ్బందులు పెట్టడం ఏంటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడం వలన గ్రామాలలో ప్రజా సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకపోయావని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్నారని, అనేకమంది అస్వస్థకు గురై గాయాలు పాలవుతున్నారని ఆయన అన్నారు. యూరియా కొరతేలేదని అధికారులు చెప్పడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ రాష్ట్రానికి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను,వేముల లింగస్వామి , అంజయ్య , రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad