Sunday, June 29, 2025
E-PAPER
Homeజాతీయంవేడుకలకు ఎవరు అనుమతిచ్చారు?

వేడుకలకు ఎవరు అనుమతిచ్చారు?

- Advertisement -

– సిద్ధరామయ్య సర్కారుకు కర్నాటక హైకోర్టు ప్రశ్నలు..!
– జూన్‌ 10 నాటికి సమాధానమివ్వాలంటూ ఆదేశాలు
బెంగళూరు:
బెంగళూరులో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్నాటక హైకోర్టు సమాధానాలు కోరింది. ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతి తీసుకున్నారా? అంటూ పలు ప్రశ్నలను కర్నాటక హైకోర్టు సంధించింది. జూన్‌ 4న ఐపీఎల్‌ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటను కర్నాటక హైకోర్టు స్వయంగా విచారించి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. జూన్‌ 10 నాటికి ఆయా ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వి.కామేశ్వరరావు, న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎం జోషిలతో కూడిన బెంచ్‌ డివిజన్‌ బెంచ్‌ ఈ విషయాన్ని స్వయంగా విచారించి ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. కార్యక్రమాన్ని నిర్వహణకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతులు పొందారా? అని కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. అలాగే, 50వేలమందికిపైగా ప్రజలు గుమిగూడే ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రామాణిక నిర్వహణ విధానం కలిగి ఉన్నదా? ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన చర్యలు తీసుకున్నారా? జనసమూహ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంఘటన స్థలంలో ఏ విధమైన వైద్య, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి? హాజరయ్యే వారి సంఖ్య గురించి ముందుగానే ఏదైనా అంచనా వేశారా? గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారా? వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది? అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -