Sunday, March 15, 2026
E-PAPER
Homeఆటలుఅంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన వికెట్ కీపర్

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన వికెట్ కీపర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన తన ప్రయాణానికి ఆదివారం వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2017లో సర్ఫరాజ్ సారథ్యంలోనే పాకిస్థాన్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. 37 ఏళ్ల సర్ఫరాజ్ పాకిస్థాన్ తరఫున 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,164 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు, 56 స్టంపింగ్‌లతో సత్తా చాటాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో ఐసీసీ టైటిళ్లు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా సర్ఫరాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

2006లో అతడి నాయకత్వంలోని అండర్-19 జట్టు ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు టీ20 ఫార్మాట్‌లో అగ్రస్థానానికి చేరడంతో పాటు వరుసగా 11 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ, ఫఖార్ జమాన్ వంటి స్టార్ ఆటగాళ్లు అతడి కెప్టెన్సీలోనే వెలుగులోకి వచ్చారు. “పాకిస్థాన్ తరఫున ఆడటం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. జట్టును అన్ని ఫార్మాట్లలో నడిపించాలన్న నా కల నెరవేరింది. నా ఎదుగుదలకు సహకరించిన సహచరులకు, కోచ్‌లకు, అభిమానులకు కృతజ్ఞతలు” అని సర్ఫరాజ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -