నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్, ఇరాన్లు ఆదివారం తెల్లవారుజామున విస్తృత దాడులు చేపట్టాయి. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ప్రకటించాయి. ఆదివారం చేపట్టిన దాడుల్లో ఎస్పిఎన్డి అణు ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాలపై దాడి జరిపినట్లు ఎక్స్లో తెలిపింది. ఇరాన్ తన అణు ఆర్కైవ్ను దాచిపెట్టిన ప్రదేశం కూడా లక్ష్యాలలో ఉన్నట్లు ఐఎడిఎఫ్ తెలిపింది.
ఇజ్రాయిల్లోని హైఫా, టెల్ అవీవ్ సహా పలు లక్ష్యాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. గత రెండు రోజుల్లో ఇజ్రాయిల్ దాడుల్లో సుమారు 80మంది మరణించగా, 800 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా ప్రకటించింది. మరణించిన వారిలో 20 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. ఇరాన్ అమెరికాతో జరుపుతున్న ఆరవ రౌండ్ చర్చలను ఇరాన్ రద్దు చేసుకుంది. ఇజ్రాయిల్ దాడుల కొనసాగుతున్నందున చర్చలు జరపడంలో ఎటువంటి ప్రయోజనం లేదని విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘ్ఛి తెలిపారు.