- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్లో ఓ కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్యతో కలిసి శంషాబాద్లో నివాసముంటున్నారు. ఏడేళ్ల వివాహం తర్వాత IVF ద్వారా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి, ఆదివారం రాత్రి 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపులో కవలలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతి చెందడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -



