- Advertisement -
నవతెలంగాణ-గాంధారి: మండలంలోని గుడిమెట్ గ్రామానికి చెందిన రైతులు ఆర్ల నడిపోల్ల బలవంతరావు, ఉమ్మెడ బోజారావు, కు చెందిన మొక్కజొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 5 నుండి 6ఎకరాల మొక్కజొన్న పంట ధ్వంసమైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అడవి శాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -