- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కెనడాలోని సస్కట్చేవాన్, మానిటోబా రాష్ట్రాల్లో విస్తారంగా వ్యాపించిన కార్చిచ్చు భయాందోళన కలిగిస్తోంది. అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మానిటోబాలో 2 లక్షల హెక్టార్లలో చెట్లు బూడిదయ్యాయి. ఇది ఐదేళ్ల సగటు నష్టానికి మూడింతలు ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కార్చిచ్చును నియంత్రించేందుకు ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, అదుపు చేయడం కష్టంగా మారింది.
- Advertisement -