– వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: న్యాయస్థానాలకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెయిల్ పొందిన తర్వాత నిందితులు ఆ మొత్తాలను చెల్లించకుండా నిరాకరిస్తున్న ధోరణిని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకల కేసుల్లోనే ఇలా ఎక్కువగా జరుగుతోందని పేర్కొంది. ఈ వ్యక్తులే మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయించి, బెయిల్ షరతులు కఠినంగా వున్నాయని లేదా తమకు తెలియకుండానే తమ న్యాయవాదులు చేశారని నిందించడం ద్వారా ఈ చెల్లింపులు జరపకుండా మినహాయింపులు కోరుతున్నారని జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీవ్వర్ సింగ్లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఇటీవల కాలంలో ఈ తరహా కుట్రలు కోర్టుల్లో బాగా పెరిగాయని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలతో ఇలాంటి ఆటలు ఆడేందుకు ఎంత మాత్రమూ అనుమతించేది లేదని బెంచ్ పేర్కొంది. రూ.13కోట్ల మేరకు పన్ను ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది మార్చిలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వివాదాస్పద మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించానని, బెయిల్ వచ్చినతర్వాత మరో రెండున్న కోట్లు చెల్లిస్తానని ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టుకు హామీఇచ్చి బెయిల్ పొందాడు. అయితే ఆ మొత్తాన్ని ఆ వ్యక్తి తిరిగి చెల్లించలేదు. దాంతో హైకోర్టు బెయిల్ను రద్దుచేసింది. దీనిపై ఆ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించాడు. దానిపై సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ కోసం న్యాయస్థానాలకే బురిడీ కొడతారా?
- Advertisement -
- Advertisement -