Saturday, June 14, 2025
E-PAPER
Homeఆటలువింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ.620 కోట్లు

వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ.620 కోట్లు

- Advertisement -

లండన్‌: ఆల్‌ ఇంగ్లాండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌ (ఏఈఎస్‌టీసీ) వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. గత ఏడాది ప్రైజ్‌మనీతో పోల్చితే ఏడు శాతం పెంపుదలతో వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ.620 కోట్లకు చేరుకుంది. మహిళల, పురుషుల సింగిల్స్‌ విజేతలు రికార్డు స్థాయిలో రూ.35 కోట్లు అందుకోనున్నారు. సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్లో ఓడిన క్రీడాకారులు సైతం రూ.76 లక్షల నగదు బహుమతి దక్కించుకోనున్నారు. ఈ నెల 30 నుంచి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆరంభం కానుండగా.. టెన్నిస్‌ క్రీడాకారుల సూచనలను అనుసరిస్తూ నిర్వాహకులు ప్రైజ్‌మనీని పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -