మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఫేస్ మాస్క్ని తయారు చేసుకోవచ్చు. ఆ ప్యాక్ ఏమిటో చూద్దాం. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, కొంచెం నిమ్మరసం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, ఒక టేబుల్ స్పూన్ తేనె. బియ్యప్పిండి మన చర్మాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కొంచెం గరుకుగా కూడా ఉంటుంది కాబట్టి, మన ముఖానికి మంచి ఎక్స్పోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. మొండి మచ్చలని సైతం సులువుగా తొలగించేస్తుంది. ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేస్తుంది. అది మన శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. దానివల్ల మన స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ మన శరీరంపై ఉండే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ముఖం కాంతివంతంగా మారేలాగా చేస్తుంది. ఇక తేనే ముఖం మీద ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది.
తయారీ విధానం: ముందుగా బియ్యప్పిండిలో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్-టీ కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
ఎలా వేసుకోవాలి: రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడుక్కుని ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత మునివేళ్లతో ముఖం మీద సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి.
బియ్యప్పిండితో…
- Advertisement -
- Advertisement -