నవతెలంగాణ – హైదరాబాద్: ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి-చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. లైంగికదాడి అనంతరం నిందితుడు రాజారావు పెదకూరపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దిగి సత్తెనపల్లి బస్సు ఎక్కాడు. బాధితురాలి ఫోన్ను అక్కడ విక్రయించి వచ్చిన డబ్బుతో బిర్యానీ తిన్నాడు. అనంతరం రైలెక్కి గుంటూరు, తెనాలి వెళ్లాడు. బాధితురాలి సిమ్ కార్డును తన ఫోన్లో వాడటంతో పోలీసులు లొకేషన్ ద్వారా గుర్తించారు. గత మూడు రోజుల విచారణలో నిందితుడు అనేక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఎనిమిది నెలల క్రితం కేరళకు చెందిన ఓ మహిళపైనా అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆది, సోమవారాలు సెలవు కావడంతో నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
రైలులో మహిళపై లైంగికదాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES