నవతెలంగాణ నవాబుపేట : మండల పరిధిలోని కాకర్జాల గ్రామ శివారులో యువతిని ( 23) దారుణ హత్య చేసి తానే హత్య చేసానని లొంగిపోయిన హంతకుడు ఈ దారుణానికి ఒడిగట్టారు.కొల్లూరు గ్రామానికి చెందిన యువకుడు జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి గ్రామానికి చెందిన గీతాంజలిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కళ్ళలో కారం చల్లి కత్తితో పొడిచి చున్నీతో గొంతుకు ఉరేసి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు.యువకుడికి గతంలో హైదరాబాద్ పట్టణానికి చెందిన స్వాతి అనే యువతితో పెళ్లి కాగా ఆమెకు ఒక కూతురు పుట్టింది తర్వాత వారిరువురి మధ్య మనస్పర్ధల కారణంగా ఆ యువకుడికి వదిలేసి తల్లి గారింటికి కూతురుతో వెళ్ళిపోయింది.జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలలో పనిచేస్తూ మల్లెబోయిన పల్లి గ్రామానికి చెందిన గీతాంజలి అనే యువతితో పరిచయం స్నేహం కుదుర్చుకున్నాడు.అప్పటికే పెళ్లి అయిన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న గీతాంజలి ప్రస్తుతం ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడికి దగ్గరైంది దీంతో వారిరువురి సహజీవనం కారణంగా ఓ బాలిక జన్మించింది.ఆ తర్వాత ఇరువురి మధ్య కూడా మనస్పర్థలు వచ్చి తారాస్థాయికి చేరాయి.పెద్దలు వారిని సముదాయించి కలిసి ఉండాలని సర్దిచెప్పినా వినకుండా మరింత మితిమీరి హత్యకు దారితీసింది.ఈ విషయంపై ఎస్ఐ విక్రమ్ ను వివరణ కోరగా హత్య జరిగింది వాస్తవమేనని హత్య జరిగినట్లు సమాచారం అందిన వెంటనే హత్య ప్రదేశంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని ఇంకా ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ విక్రమ్ చెప్పారు
మహిళ దారుణ హత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES