Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంవైభవ్ సూర్యవంశీ ఆట‌కు వ‌ర‌ల్డ్ ఫిదా: ప్ర‌ధాని మోడీ

వైభవ్ సూర్యవంశీ ఆట‌కు వ‌ర‌ల్డ్ ఫిదా: ప్ర‌ధాని మోడీ

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోడీని ఐపీఎల్ యువ సంచ‌ల‌నం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్(RR) వైభవ్ సూర్యవంశీ క‌లిశారు. శుక్ర‌వారం పాట్న‌లో ఎయిర్ పోర్టులో కుటుంబ‌స‌భ్య‌ల‌తో పీఎంను క‌లిశారు.ఈ సంద‌ర్భంగా వైభ‌వ్ పై ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌లు కురింపిచారు. టీనేజ‌ర్ ప్ర‌తిభా క్రికెట్ లో అద్భుతమ‌ని, యావ‌త్తు దేశ క్రికెట్ అభిమానులు వైభ‌వ్ ఆట వారిని క‌ట్టిప‌డేసింద‌ని మెచ్చుకున్నారు. భ‌విష్య‌త్‌లో వైభ‌వ్ అనుకున్నరీతిలో ఆశాజ‌నంగా సాగాల‌ని తాను మ‌న‌స్సుపూర్తిగా కోరుకుంటున్నాన‌ని ప్ర‌ధాని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు.

కాగా, జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)పై అతను చేసిన అద్భుతమైన సెంచరీ క్రికెట్ ప్రపంచంలో నిజంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. తన వయస్సుకు మించిన పరిణతితో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి.. T20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన సెంచరీగా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే వచ్చిన అతని సెంచరీ ఇప్పుడు IPL చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. అంతేకాకుండా 14 ఏండ్ల వ‌య‌స్సులో అద్భుతమైన ఫీట్ సాధించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -