– తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి
నవతెలంగాణ-హైదరాబాద్ : కెసిఆర్ నాడు అధికారం కోసం బీసీ రిజర్వేషన్స్ తగ్గిస్తే.. నేడు కూతురు అదే బీసీల రిజర్వేషన్స్ పై కేంద్రమంత్రికి లేఖ రాయడం హాస్యాస్పదం అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కవిత ఒక ఎంపీగా ఉండగా బీసీల రిజర్వేషన్లని తగ్గించింది మీరు .. ఆనాడు ఎంపీగా స్పందించని కవిత ఈ రోజు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడం హాస్యాస్పదం ..అది కూడా మా కాంగ్రెస్ పార్టీ బీసీ లకు 42 % రిజర్వేషన్లు ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు కేంద్రానికి పంపిన తరువాత ఇప్పుడు మీరు బీసీల గురించి మాట్లాడటం కేవలం ఓట్ల కోసమే డ్రామాలు కాక మరి ఏమిటి..?
కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న అయినా బీసీ సమస్యలపై అడిగిన దాఖలా ఉందా? లేక ‘బీసీ’ అనే పదం ఎన్నికల ముందు గుర్తుకు వచ్చిందా ? ఓటు కోసమే అయితే ఒక్కసారి చెప్పండి? బీసీ అభివృద్ధి కోసo , డిస్ట్రిక్ట్ వర్గాల కోసం ఇప్పటి వరకూ ఏ స్కీం అమలు చేశారు?” ఏ రోజైనా బీసీ ఆత్మగౌరవ సభ’ పెట్టారా?
రిజర్వేషన్ లేఖలు రాసేలోపే… మీ పార్టీలో బీసీ నేతలకు ఇచ్చిన పూర్తి మంత్రి పదవులు చూపించగలరా?”
ఎంపీ పదవి లో ఐదేళ్లు కొనసాగించినప్పుడు బీసీ విద్యార్థి కోసం ఒక్క స్కాలర్షిప్ కార్యక్రమం అయినా ప్రారంభించారా? అని రేఖ బోయలపల్లి ప్రశ్నించారు.
బీసీల రిజర్వేషన్స్ పై కేంద్రమంత్రికి లేఖ రాయడం హాస్యాస్పదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES