- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిచర్ల ఓసీపీలో 11వ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాణాయామం,యోగాసనాలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు దినచర్యలో భాగంగా యోగాకు కొంత సమయం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ జనరల్ మేనేజర్ కెఎస్ఏన్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, డీజీఎం రమేష్ బాబు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -