- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖలో జరిగే యోగా డేలో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలందరినీ యోగా డేలో భాగస్వాములను చేయాలన్నారు. ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్గా పాటించాలని చెప్పారు. ఈ నెల రోజుల్లో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ అందజేయాలని అధికారులకు సూచించారు.
- Advertisement -