- Advertisement -
నవతెలంగాణ పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిఖిత (27) అనే యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్కూటీపై వెళ్తుండగా జారి పడటంతో వెనకాలే వస్తున్న ప్రయివేటు విద్యాసంస్థకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు టైరు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై ఆమె స్పాట్ లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
- Advertisement -



