- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన విజయలక్ష్మి (26) హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల్లో వస్తానని వెళ్లిన ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాగర్లో లభ్యమైన మృతదేహం విజయలక్ష్మిదేనని గుర్తించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
- Advertisement -



