- Advertisement -
- ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ-మల్హర్రావు: యువత చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో జంగిడి లచ్చయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జంగిడిపల్లి జట్టుకు రూ.3016, రన్నర్ రూ.1500 నగదుతోపాటు షీల్డ్ కవర్స్ సర్పంచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్,వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,ప్రజలు,టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -



