Tuesday, May 6, 2025
Homeఅంతర్జాతీయంఈనెల 8న ఇండియా రానున్న‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి

ఈనెల 8న ఇండియా రానున్న‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 8న ఇండియాకు రానున్నార‌ని.. ఆదేశ ఎంబీసీ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పేర్కొంది. తాజాగా ఆయ‌న పాకిస్థాన్ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ దేశ ప‌ర్య‌ట‌న ముగియ‌గానే ఇండియాలో ప‌ర్య‌టిస్తార‌ని వెల్ల‌డించింది.అరాగ్చి పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, సహకారాన్ని పెంచుతుందని ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాకిస్థాన్‌కుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ దేశాలతో ఇరాన్‌ కొనసాగిస్తున్న సంప్రదింపులలో భాగంగా విదేశాంగ మంత్రి అరాగ్చి పార్‌ భారత్‌లలో పర్యటించనున్నారని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్‌ బఘై శనివారం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -