నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు తెచ్చుకుని అరుదైన ఘనత సాధించింది. నేహాంజని నగరంలోని భాష్యం పాఠశాలలో చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599/600 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థిని 598/600 మార్కులు సాధించి రికార్డు నమోదు చేశారు.
- Advertisement -