Tuesday, April 29, 2025
Homeజాతీయంఏపీలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

ఏపీలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజుజయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img