Monday, July 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి

తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – తాడూరు
తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు ప్రాణం కోల్పోయిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండల పరిధిలోని సిర్సవాడలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సిర్సవాడ గ్రామానికి చెందిన చింతకింది మల్లేష్‌ (35) రోజు మాదిరిగానే ఉదయం కల్లు తీతకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఆధారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -