- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాల్పుల విరమణపై నిన్న అవగాహనకు వచ్చినా.. పాక్ మళ్లీ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. నిన్నటిలా పాక్ ఇవాాళ కూడా దాడులు కొనసాగిస్తే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ప్రతిచర్యలు తీసుకునేలా తమకు సంపూర్ణ అధికారం ఇచ్చారని తెలిపారు. పాక్ తుపాకీతో కాల్పులు జరిపితే.. భారత్ మిస్సైల్స్తో జవాబివ్వనుందని పేర్కొన్నారు.
- Advertisement -