– డీలర్ల వద్ద రూ.52 వేల కోట్ల ఇన్వెంటరీస్
న్యూఢిల్లీ : దేశంలో కార్ల అమ్మకాలు పడిపోయాయి. భారీగా పెంచిన ధరలకు తోడు, డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది మే ముగింపు నాటికి దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద రూ.51,000-52,000 కోట్ల విలువైన కార్ల నిల్వలు పెరుకుపోయాయి. ఆటోమొబైల్ సంస్థలు రోజుకో కొత్త మోడల్తో ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం కూడా నిల్వలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2024 దీపావళి సమయంలో ఇన్వెంటరీ స్టాక్ 40 నుంచి 45 రోజులు ఉండగా.. గడిచిన మేలో ఇది 34-38 రోజులకు తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం భారీగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో 3,02,214 కార్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో విక్రయించిన వాటితో పోల్చితే 3.14 శాతం తగ్గాయి. గడిచిన ఏడాది ఆటోమొబైల్ కంపెనీలు 10 శాతం మేర ధరలను పెంచాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ ఎక్సేంజీ రేట్ల కారణంగా చూపించి ధరలు పెంచాల్సి వస్తుందంటున్నారు. ఇన్వెంటరీ స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుందని.. ప్రస్తుతం ఇది 52-53 రోజుల స్థాయిలో ఉందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ సమాఖ్య(ఫాడా) పేర్కొంది. దీంతో డీలర్ల నిర్వహణ ఖర్చులు అధికమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది.
పేరుకుపోయిన కార్ల నిల్వలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES